Friday, April 19, 2024
Friday, April 19, 2024

వైసీపీతోనే యువతకు భవిష్యత్తు

విశాలాంధ్ర- పెద్దకడబూరు : వైసీపీతోనే యువతకు భవిష్యత్తు ఉంటుందని వ్యవసాయ సలహా మండలి చైర్మన్ పురుషోత్తం రెడ్డి, వైసీపీ మండల కన్వీనర్ రామ్మోహన్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా మంగళవారం మండల పరిధిలోని నౌలేకల్, మేకడోన, గవిగట్టు, పీకలబెట్ట, బాపులదొడ్డి, చిన్నతుంబలం గ్రామాలలో పర్యటించి పట్టభద్రులను కలిసి వైయస్సార్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి వెన్నపూస రవీంద్రారెడ్ఢికి మొదటి ప్రాధాన్యత ఓటును వేయాలని కోరారు. సంక్షేమం, సమానతల దిశగా ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అడుగులు వేస్తున్నారని తెలిపారు. 11 మంత్రి పదవులను బిసి వర్గాలకు కేటాయించారన్నారు. కావున ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి వెన్నపూస రవీంద్రారెడ్ఢిని ఆదరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రోడ్డు అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ చంద్రశేఖర రెడ్డి, గజేంద్ర రెడ్డి, రవి చంద్రారెడ్డి విజేంద్రరెడ్డి, పూజారి ఈరన్న, తిక్కన్న, ముక్కరన్న, యల్లప్ప, నాగరాజు, మహాదేవ, మూకిరెడ్డి, వీరేష్, హనుమంతరెడ్డి, ప్రసాద్, లింగన్న గౌడ్, బొడ్డన్న తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img