విశాలాంధ్రó`శెట్టూరు : మండలంలో ఖైరేవు గ్రామానికి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గాజుల గోవిందప్ప అనారోగ్యరిత మృతి విషయాన్ని తెలుసుకున్న జడ్పిటిసి మంజునాథ సోమవారం కైరేవు గ్రామానికి వెళ్లి కుటుంబాన్ని పరామర్శించి కాంగ్రెస్ పార్టీ స్థాపించినప్పటి నుంచి పార్టీ కోసం కష్ట కాలంలో పార్టీకి వెన్నంటి నిలిచారు అని ఆయన మరణం పార్టీకి తీరనిలోటని వీరవిధేయుడు ఏనాడూ పదవులు అధికారం ఆశించి పార్టీ లో పని చేయలేదు పార్టీ కోసం నిస్వార్థంగా కృషి చేశారు అని కుటుంబానికి ప్రభుత్వం తరఫున వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసా కల్పించారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ గొర్ల లక్ష్మీ దేవి, సింగిల్ విండో డైరెక్టర్ గొర్ల గంగాధర్, గొర్ల కృష్ణ, మహాలింగ, స్థానిక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.