విశాలాంధ్ర` పెద్దకడబూరు :మండల కేంద్రమైన పెద్దకడబూరులోని ముస్లిం షాదీఖానాకు సరిహద్దులు చూపించాలని శుక్రవారం ముస్లిం సోదరులు తహసీల్దార్ కార్యాలయంలోని జూనియర్ అసిస్టెంట్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామానికి షాదీఖానా మంజూరై శంకుస్థాపన జరిగిందన్నారు. కానీ షాదీఖాన నిర్మాణం మధ్యలోనే ఆగిపోయిందన్నారు. ఈ విషయాన్ని ముస్లింలు ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. ఇందుకు స్పందించిన ఎమ్మెల్యే నిధులు మంజూరు చేయించారన్నారు. కావున అధికారులు స్పందించి షాదీఖానాను సర్వేచేయించి హద్దులు చూపించి, నిర్మాణం పూర్తి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ముస్లిం సోదరులు,కె. ఎం భాషా, ఖలీల్, ఖాజా, నబీ, నజీర్, ఇస్మాయిల్, బడే సాబ్, రియాజ్, భాషా తదితరులు పాల్గొన్నారు.