Friday, April 19, 2024
Friday, April 19, 2024

సంక్షేమ పాలన వైసిపి తోనే సాధ్యం ….కోడుమూరు ఎమ్మెల్యే

గూడూరు : దేశంలో ఏరాష్ట్రాంలో అమలు కానీ సంక్షేమ పథకాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్నారని కర్నూలు జిల్లా కోడుమూరు ఎమ్మెల్యే డాక్టర్. సుధాకర్ తెలిపారు. మా నమ్మకం నువ్వే జగనన్న కార్యక్రమానికి సంబంధించి కోడుమూరు నియోజకవర్గం వైకాపా పార్టీ కార్యాలయంలో ఆయన పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళలకు ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తూ సంక్షేమ పథకాలు అన్ని వారి పేరుమీదే అమలు చేస్తున్నామని ఆయన తెలిపారు. గత 70 సంవత్సరాల పాలనలకు భిన్నంగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్షేమ పరిపాలన కొనసాగుతుందని ఎమ్మెల్యే తెలిపారు. ఎన్నికలకు ముందు చెప్పిన అన్ని హామీలను నెరవేర్చిన ఘనత కూడా ముఖ్యమంత్రి కే చెల్లుతుందని ఆయన తెలిపారు. తమ పరిపాలన నచ్చితేనే ఎన్నికల్లో ఓటు వెయ్యాలని అడుగుతున్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని సుదాకర్ తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో సైతం మొదటి ప్రాధాన్యత ఓట్లలో వైకాపా ప్రభుత్వానికే అధిక ఓట్లు వచ్చాయని తెలుగుదేశం పార్టీ రెండవ ప్రాధాన్యతో గెలిచిందని ఆయన తెలిపారు. వచ్చే ఎన్నికల్లో సైతం ఒంటరిగానే పోటీ చేసి గెలుపొందుతామని ఎమ్మెల్యే తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img