Friday, April 19, 2024
Friday, April 19, 2024

సంక్షేమ ప్రధాత జగన్ ను దీవించండి

విశాలాంధ్ర, పెద్దకడబూరు : సంక్షేమ ప్రధాత జగన్ ను రాబోయే ఎన్నికల్లో ప్రజలు దీవించాలని వైసీపీ మండల కన్వీనర్ రామ్మోహన్ రెడ్డి, రోడ్డు అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ చంద్రశేఖర రెడ్డి, అన్నారు. బుధవారం మండల కేంద్రమైన పెద్దకడబూరులోని సచివాలయం – 2 పరిధిలో సచివాలయ కన్వీనర్లు రవిచంద్రా రెడ్డి, శివరామరెడ్డి ఆధ్వర్యంలో జగనన్నే మా భవిష్యత్తు – మా నమ్మకం నువ్వే జగన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు ప్రతి ఇంటికి వెళ్లి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పేదల కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను వారు వివరించారు. జగన్ హయాంలో ప్రతి ఒక్కరికీ లబ్ధి చేకూరిందన్నారు. కావున మరోసారి ముఖ్యమంత్రిగా జగన్ ను ఆదరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు నవీన్ రెడ్డి, బారుసబ్బు అనిల్, పూజారి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img