విశాలాంధ్ర – శెట్టూరు : సమాజంలో అన్ని వర్గాల ప్రజల సమానత్వాన్ని కాంక్షించి సమసమాజ స్థాపనకు కృషి చేసిన మహనీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే అని దళిత యువ నాయకుడు ఎమ్మెస్ హనుమంతరాయుడు అన్నారు. నేడు మహాత్మా జ్యోతిరావు పూలే 197వ జయంతి సందర్భంగా ఆర్డిటి పాఠశాల వద్ద మహాత్మా జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహాత్మ జ్యోతి రావు పూలే సమసమాజ స్థాపనకై అహర్నిశలు కృషి చేసి, కుల వివక్షతకు వ్యతిరేకంగా పోరాడిన ధీశాలి అని కొనియాడారు. వర్ణ వివక్షను రూపుమాపడం కోసం, దళిత, బహుజన, మహిళా వర్గాల అభ్యున్నతి కోసం, మహాత్మా ఫూలే కార్యాచరణ మహోన్నతమైనదని, కుల,లింగ వివక్షకు తావు లేకుండా అందరికీ విద్య, సమానత్వం ద్వారానే సామాజిక ఆర్థిక సమున్నతికి బాటలు పడతాయనే విశ్వాసాన్ని నమ్మిన గొప్ప మేధావి అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో దళిత నాయకులు టైలర్ వన్నూరు స్వామి, ఆదిశేషు తిప్పేస్వామి , బహుజన పార్టీ నాయకురాలు నాగమ్మ,, దుర్గేష్, రమేష్, నరసింహులు, బాబు, అంజి, రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు