Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

సిపిఐ పార్టీకి స్పందించిన భారత్‌ గ్యాస్‌ యాజమాన్యం

విశాలాంధ్ర` పెద్దకడబూరు : మండల పరిధిలోని కల్లుకుంట గ్రామంలో ముక్కరన్న అనే వ్యక్తి గ్యాస్‌ లీకయి గాయపడడం జరిగింది. ఈ విషయాన్ని తెలుసుకొన్న సిపిఐ మండల కార్యదర్శి వీరేష్‌, రైతు సంఘం తాలూకా కార్యదర్శి ఆంజనేయ భారత్‌ గ్యాస్‌ యాజమాన్యానికి తెలిపారు. ఇందుకు స్పందించిన యాజమాన్యం ముక్కరన్నకు 5 వేల రూపాయలు నగదును, నిత్యావసర సరుకులను ఇవ్వడంతో పాటు ఆసుపత్రి ఖర్చులు కూడా భరించడం జరిగిందని వారు తెలిపారు. గ్యాస్‌ వినియోగించే వినియోగదారులు ఏదైనా ప్రమాదం జరిగితే వెంటనే యాజమాన్యానికి తెలపాలని కోరారు. భాధితునికి సహాయం అందజేసిన భారత్‌ గ్యాస్‌ నిర్వాహకులు మాధురి, లక్ష్మన్న లకు మరియు సిబ్బంది ఈరన్న, రంగారెడ్డి, శివ, ఆనందు, బాలుకు సిపిఐ తరుపున కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img