Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

2 లక్షల వ్యయంతో తాగునీటి పైపులైన్ ఏర్పాటు

విశాలాంధ్ర- పెద్దకడబూరు : మండల కేంద్రమైన పెద్దకడబూరులోని 2,10 వార్డులకు జెడ్పీటీసీ నిధులు 2 లక్షల వ్యయంతో నిర్మించిన తాగునీటి పైపులైన్, కొళాయిలను శనివారం గ్రామ సర్పంచ్ రామాంజనేయులు ఆధ్వర్యంలో వైసీపీ మండల కన్వీనర్ రామ్మోహన్ రెడ్డి, రోడ్డు అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ చంద్రశేఖర్ రెడ్డి, వార్డు సభ్యులు బ్రహ్మయ్య ఆచారి, కోసిగి బసన్నలు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 10 మరియు 2వ వార్డులలోని కుటుంబాలు తాగునీటి సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడేవారని తెలిపారు. ఈ విషయాన్ని కాలనీ వాసులు వైసీపీ మండల నాయకులకు తెలపడంతో వెంటనే వారి సమస్యను ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. స్పందించిన ఎమ్మెల్యే జడ్పీటీసీ నిధులు మంజూరు చేయించినట్లు తెలిపారు. ఎమ్మెల్యే సహకారంతో జెడ్పీటీసీ నిధులు ద్వారా తాగునీటి సమస్యను అధిగమించేందుకు స్థానిక బస్టాండ్ నుండి 10 మరియు 2వ వార్డులకు రెండు లక్షల వ్యయంతో ప్రత్యేక పైపులైన్, 12 కొళాయిలు ఏర్పాటు చేశామన్నారు. తాగునీటి సమస్యను పరిష్కరించినందుకు మండల వైసీపీ నాయకులకు కాలనీ వాసులు కృతజ్ఞతలు తెలిపారు. తమ ప్రభుత్వం చేతల ప్రభుత్వం అని ఇచ్చిన మాట తప్పమన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు శాంతి మూర్తి, ముని, రామాంజనేయులు, అంజినయ్య, కాలనీవాసులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img