Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

గ్రంథాలయంను సద్వినియోగం చేసుకోవాలి

విశాలాంధ్ర- పెద్దకడబూరు : గ్రంథాలయంను సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులను, గ్రామస్తులను ఐసీడీఎస్ సూపర్ వైజర్ శివ లింగమ్మ కోరారు. బుధవారం పెద్దకడబూరులోని స్థానిక గ్రంథాలయం నందు గ్రంథాలయ అధికారిణి ఆశాజ్యోతి ఆధ్వర్యంలో ఐసీడీఎస్ సూపర్ వైజర్ శివ లింగమ్మ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆరోగ్యం పట్ల శ్రధ్ద వహించి, పలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అనంతరం విద్యార్థులకు పుస్తక పఠనం మరియు కథలు చెప్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img