Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

పోలవరం, జంఝూవతి, జంపర్ల కోట ప్రాజెక్టులను పూర్తి చేయాలని పోరాడుతాం…సిపిఐ

రెండవ రోజు కొనసాగిన నిరాహార దీక్షలు…

విశాలాంధ్ర – బెలగాం : పోలవరం ప్రాజెక్టుకు సక్రమంగా పూర్తి చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి కూరంగి మన్మదరావు డిమాండ్ చేశారు. పోలవరం ఎత్తు తగ్గించకుండా పూర్తి చేయాలని పార్వతీపురం కలెక్టర్ కార్యాలయం ఎదుట సిపిఐ ఆధ్వర్యంలో రెండవ రోజు నిరాహారదీక్షలు చేపటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన కేంద్రం ఇవాల నిండా ముంచి ప్రాజెక్టును సక్రమంగా పూర్తి చేయకుండా రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నదని, పోలవరంపై కేంద్రం పదేపదే అన్యాయం చేస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నోరు మెదపకుండా చోద్యం చూస్తోందని విమర్శించారు. ప్రాజెక్టు ఎత్తును 135 అడుగులను తగ్గించి, అక్కడ 92టిఎంసిలు నిల్వ ఉండడం వలన మన రాష్ట్రానికి ఏరకంగాను ప్రయోజనం ఉండదని, దీనివల్ల ప్రత్యేకించి ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలు ఘోరంగా దెబ్బతింటాయన్నారు. జిల్లా సహాయ కార్యదర్శి తోట జీవన్ మాట్లాడుతూ, రాజకీయ నాయకులు, నిపుణులంతా 156 అడుగుల ఎత్తు 196 టిఎంసిల నీటి నిల్వకు పోలవరం ప్రాజెక్టుకు ప్రతిపాదించినా కేంద్ర ప్రభుత్వం పట్టనట్లు వ్యవహరిస్తోందన్నారు. పోలవరం ఎత్తు తగ్గించడం వలన రాష్ట్రానికి నష్టం వాటిల్లుతుందన్నారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం దిగివచ్చేవరకు సిపిఐ పార్టీగా పోరాటం చేస్తామన్నారు. అలాగే పార్వతీపురం మన్యం జిల్లాలో పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులను తక్షణమే పూర్తి చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న కార్యక్రమంలో బాగంగా పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిరాహార దీక్షలు సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో చేపడుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమం లో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు గరుగుబిల్లి సూరయ్య, పువ్వల ప్రసాద్, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి బిటి నాయుడు, కూరంగి జగదీష్, గిరిజన సంక్షేమ సంఘం జిల్లా నాయకులు దుక్క సీతారాం, గిరిజన విద్యార్ధి సంఘం నాయకులు పి. సురేష్, వెంకటరావు, రంగారావు తదిరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img