విశాలాంధ్ర- కర్నూలు సిటీ: అమరజీవి పొట్టి శ్రీరాములు జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శనీయమనిలయన్స్ జిల్లా అడిషనల్ క్యాబినెట్ సెక్రటరీ లయన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ తెలిపారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని లయన్స్ క్లబ్ ఆఫ్ కర్నూలు మెల్విన్ జోన్స్, నైస్ స్వచ్ఛంద సేవా సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో నైస్ కంప్యూటర్స్ కార్యాలయంలో పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలను అలంకరించి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ మాట్లాడుతూ భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటు చేయాలని తెలుగువారి కోసం ప్రాణ త్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములును నేటి తరం యువత గుర్తుంచుకోవాలన్నారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ కర్నూల్ మెల్విన్ జోన్స్ అధ్యక్షురాలు లయన్ రాయపాటి నాగలక్ష్మి, లయన్స్ క్లబ్ కార్యవర్గ సభ్యులు,నైస్ స్వచ్ఛంద సేవా సంస్థ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.