Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

విద్యార్థులలో సేవాగుణం పెంపొందాలి

విశాలాంధ్ర – గూడూరు : విద్యార్థుల లో విద్యార్థి దశలోనే సేవాగుణం పెంపందాలని జూలకల్లు ఏపీ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ దిల్షాద్ తెలిపారు. బుధవారం గూడూరు పట్టణంలోని  ఎస్సీ బాలికల వసతి గృహానికి జులకల్ ఏపీ మోడల్ స్కూల్ కు చెందిన ఆరు మరియు ఏడవ తరగతి విద్యార్థులు తమ సొంత ఖర్చులతో వసతి గృహానికై నాలుగు ఫ్యాన్లు ఎనిమిది దోమతెరలను బహూకరించారు. వీటిని విద్యార్థుల చేతుల మీదుగా ఎస్సీ బాలికల వసతి గృహం లోని విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ దిల్షాద్ మాట్లాడుతూ విద్యార్థులకు తోటి వారికి సహాయం చేయాలన్న సంకల్పం చిన్నతనం నుండి అలవాటు చేయడం వల్ల వారిలో సేవాభావం పెంపొందుతుందని తెలిపారు. కార్యక్రమంలో మోడల్ స్కూల్ అధ్యాపక బృందం మరియు ఎస్సీ బాలికల వసతి గృహం వార్డెన్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img