Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

రైతుల తరపున కోర్టుకు వెళతాం

విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న టిడిపి రైతు విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి నరవ రమాకాంతరెడ్డి
విశాలాంధ్ర, పెద్దకడబూరు : భూ రీసర్వేలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం రైతులకు జారీ చేసిన పట్టాదారు పాసుపుస్తకాలపై ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉండటంపై టిడిపి రైతు విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి నరవ రమాకాంతరెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. బుధవారం పెద్దకడబూరులో ఆయన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ రాష్ట్రంలో కోట్లాది రూపాయలు ఖర్చు చేసి భూ రీసర్వే నిర్వహించిన రాష్ట్ర ప్రభుత్వం రైతులకు జారీ చేసిన పట్టాదారు పాసుపుస్తకాలపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఫోటో ముద్రించడం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా రైతుల పట్టాదారు పాసుపుస్తకాలపై తమ ఫోటో ముద్రించలేదని, కానీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తమ ఫోటో వేయించుకోవడంపై రైతుల తరపున టిడిపి రైతు విభాగం కోర్టుకు వెళతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ బసలదొడ్డి ఈరన్న, ఎస్సీ సెల్ రాష్ట్ర నాయకులు ఏసేపు, బీసీ సెల్ సాధకార రాష్ట్ర కమిటీ సభ్యులు మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img