Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

పూజారి వెంకట రమణయ్య పార్ధీవదేహానికి నివాళులు

కర్నూలు జిల్లా : కోడుమూరు నియోజకవర్గం గూడూరు పట్టణం కోటవీధి [కోటగడ్డ]కు చెందిన పూజారి రాజశేఖర్ గారి తండ్రి పూజారి వెంకట రమణయ్య గారు గత కొన్ని రోజులుగా పెంచికలపాడు గ్రామంలోని విశ్వభారతి హాస్పిటల్ నందు చికిత్స పొందుతూ నిన్న సాయంత్రం తుదిశ్వాస విడిచారు..

ఈ సమాచారాన్ని తెలుసుకున్న వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోడుమూరు నియోజకవర్గ సీనియర్ నాయకులు,మాజీ ఎమ్మెల్యే,మాజీ టీటీడీ పాలకమండలి సభ్యులు పరిగెల మురళీకృష్ణ వెంటనే గూడూరు పట్టణానికి చేరుకొని పూజారి వెంకట రమణయ్య గారి పార్థివదేహానికి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు..

ఈ కార్యక్రమంలో నాతో పాటు వైసీపీ పార్టీ జిల్లా కార్యదర్శి పోలకల్ బాలకృష్ణ,వైసీపీ పార్టీ కోడుమూరు నియోజకవర్గ యూత్ అధ్యక్షుడు మేకల గిరి కుమార్,రెడ్డిపోగు అనిల్ కుమార్,అంజి రాయలసేన, సిద్ధిక్,రాము,శివ,దాదాపీర్,రాజు,దేశ్పాండే వలి,పూజారి రవికాంత్ మరియు వైసీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img