విశాలాంధ్ర – ఆళ్లగడ్డ : వైకాపా పాలన రాక్షస పాలన అని మాజీ రాజ్యసభ సభ్యుడు నరెడ్డి తులసి రెడ్డి విమర్శించారు. బుధవారం స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం నిమిత్తం, నంద్యాల పార్లమెంట్ జిల్లా అధ్యక్షులు జె. లక్ష్మి నరసింహ యాదవ్ ఆదేశాల మేరకు ఆళ్లగడ్డ నియోజకవర్గ సమన్వయ కర్త బరగోడ్ల హుస్సేన్ బాషా ఆధ్వర్యంలో తులసి రెడ్డి మాట్లాడారు .కేంద్రం లో బిజెపి, రాష్ట్రము లో వైకాపా ప్రభుత్వాలు ఈ రెండు పార్టీ లు రాహువు, కేతువు లాగా వ్యవహారిస్తున్నాయన్నారు. అలాగే ముఖ్య మంత్రి జగన్ రాయలసీమ వాసిగా ఉంటూ సీమకు తీరని ద్రోహం చేస్తున్నాడన్నాడు. జగన్ మాట తప్పడం ప్రతి రోజు దిన చర్యగా మారిందన్నారు. రాష్టంలో రాక్షస పాలన అంతం కావాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి అటు కేంద్రం లో రాహుల్ గాంధీని ప్రధాని గా గెలిపించుకుందామని, ఇటు కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. నియోజకవర్గ సమన్వయకర్త బరగొడ్ల హుస్సేన్ బాషా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే Aూ కి ప్రత్యేక హోదా మీద తొలి సంతకం చేయడం జరుగుతుందన్నారు. అలాగే 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, రైతులకు రుణమాఫీ అనేక ప్రభుత్వ పధకాలను ప్రజల మేలుకొరకు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మైనారిటీ కార్యదర్శి శంసుల్ హాక్, కాంగ్రెస్ పార్టీ రుద్రవరం మండల అధ్యక్షులు శ్రేనివాసులు, కాంగ్రెస్ దొర్నిపాడు మండల అధ్యక్షులు చాకలి నాగయ్య, నంద్యాల పార్లమెంట్ సోషల్ మీడియా కో ఆర్డినేటర్ సంజీవ కుమార్, లక్ష్మయ్య, నాగేంద్ర, బాషా, కిషోర్, రాజు,హుస్సేన్ బాషా, శ్రీరామ్, నాగరాజు, నవీన్, నరసింహరెడ్డి, ఉత్తన్న, సుబ్బారాయుడు, అమిర్, హరుణ్, వినయ్ తదితరులు పాల్గొన్నారు.