‘భారత్ జోడో’ యాత్ర కాదు.. పాకిస్థాన్, బంగ్లాదేశ్లను ఏకీకృతం చేసి ‘అఖండ భారత్’ కోసం కృషి చేయాలంటూ రాహుల్ గాంధీపై అసోం సీఎం హిమంత బిశ్వశర్మ అన్నారు. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా భారత్లో పర్యటిస్తున్న వేళ ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం వివాదాస్పదమయ్యాయి. రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో’ యాత్రను విమర్శించే క్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రాహుల్ యాత్రపై స్పందించాల్సిందిగా మీడియా కోరగా ఆయన ఇలా స్పందించారు. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు భారత్ ఇప్పుడు ఐక్యంగానే ఉందని అన్నారు. సిల్చార్ నుంచి సౌరాష్ట్ర వరకు మనమంతా ఒకటేనని అన్నారు. భారత్ను కాంగ్రెస్సే భారత్, పాకిస్థాన్గా విడగొట్టిందని, ఆ తర్వాతే బంగ్లాదేశ్ ఏర్పడిరదన్నారు. రాహుల్ గాంధీ కనుక తన కుటుంబం చేసిన తప్పుకు పశ్చాత్తాపం పడితే ఆయన భారత్ జోడో యాత్ర కాకుండా.. పాకిస్థాన్, బంగ్లాదేశ్లను కలిపే అఖండ భారత్ కోసం కృషి చేయాలని అన్నారు.