: మమతబెనర్జి
కేంద్ర ఎన్నికల సంఘం పశ్చిమబెంగాల్లో ఉప ఎన్నికల షెడ్యూల్ కచ్చితంగా ఇవ్వాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతబెనర్జి డిమాండు చేశారు. అసెంబ్లీకి, శాసనమండలికి ప్రతినిధులను ఎన్నుకోవడం కోసం తమ ఓటు హక్కును వినియోగించుకునే హక్కు ప్రజలకు ఉందని మమతా చెప్పారు. సీనియర్ నేత దినేశ్ త్రివేది అసెంబ్లీ ఎన్నికల ముందు పార్టీకి, పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరడంతో ఆ స్థానం ఖాళీ అయ్యింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో తాను స్వయంగా పోటీచేసిన స్థానంలో మమత ఓడిపోయింది. ఎమ్మెల్యేగా ఓడిపోయినా సీఎం పదవి చేపట్టిన మమత.. తన పదవిని నిలబెట్టుకోవాలంటే ఆరు నెలల్లోగా అసెంబ్లీకిగానీ, మండలికిగానీ ఎన్నిక కావాల్సిన అవసరం ఉన్నది. ఈ నేపథ్యంలో ఆమె మండలి ఎన్నికలకు సంబంధించి కొత్త షెడ్యూల్ను విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు.