Saturday, April 1, 2023
Saturday, April 1, 2023

భారత సుప్రీంకోర్టులో.. సింగపూర్‌ సుప్రీంకోర్టు సీజే

భారత సుప్రీంకోర్టులో సందడి చేశారు సింగపూర్‌ సుప్రీంకోర్టు సీజే జస్టిస్‌ సుందరేశ్‌ మీనన్‌.. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనంతో కలిసి కూర్చున్నారు సుందరేశ్‌ మీనన్‌. సుప్రీంకోర్టు 73వ వార్షికోత్సవం సందర్భంగా శనివారం నిర్వహించనున్న కార్యక్రమానికి హాజరయ్యేందుకు భారత్‌ కు జస్టిస్‌ మీనన్‌ వచ్చారు. ఈ సందర్భంగానే సీజేఐ బెంచ్‌ తోపాటు కోర్టులో కూర్చున్నారు. ఇక రేపు నిర్వహించే కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జస్టిస్‌ మీనన్‌ పాల్గొంటారు. ‘ప్రపంచాన్ని మార్చడంలో న్యాయ వ్యవస్థ పాత్ర’ అనే అంశంపై జస్టిస్‌ మీనన్‌ ప్రసంగిస్తారు. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయమూర్తులతో సింగపూర్‌ సీజే చర్చలు జరపనున్నారు. రెండు న్యాయవ్యవస్థల మధ్య మరింత సహకారం, న్యాయ విద్య, జ్ఞానాన్ని పంచుకునే అవకాశాల గురించి చర్చించే అవకాశం ఉందని సుప్రీంకోర్టు ఓ ప్రకటనలో తెలిపింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img