అండమాన్ నికోబార్ దీవుల్లో మంగళవారం ఉదయం మూడు గంటల వ్యవధిలో నాలుగుసార్లు భూమి కంపించింది. ఉదయం 6.27 గంటల సమయంలో రిక్టర్ స్కేల్పై 4.3 తీవ్రతతో భూమి కంపించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. క్యాంప్బెల్ బేకు 235 కిలోమీటర్ల దూరంలో, భూమికి పది కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు పేర్కొంది.ఆ తర్వాత రిక్టర్ స్కేల్పై 4.6 తీవ్రతతో, మరోసారి ఉదయం 9.12 గంటలకు రిక్టర్ స్కేల్పై 6.1 తీవ్రతతో భారీ భూమి కంపించింది. అయితే, భూకంపంతో నష్టానికి సంబంధించి ఎలాంటి నివేదికలు అందలేదని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. ప్రాణ, అస్తి నష్టానికి సంబంధించి సమాచారం అందలేదని అధికారులు వెల్లడిరచారు.