Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

అందుకే.. యోగి ప్రమాణ స్వీకారానికి రాలేకపోయా…

కేంద్ర మాజీ మంత్రి ఉమా భారతి ట్వీట్‌
ట్రాఫిక్‌జామ్‌ కారణంగా యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ప్రమాణ స్వీకారానికి హాజరు కాలేకపోయానని కేంద్ర మాజీ మంత్రి ఉమా భారతి ట్వీట్‌ చేశారు. ‘‘యోగి జీ మంత్రివర్గం ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యేందుకు నేను లక్నో వచ్చాను. ట్రాఫిక్‌ జామ్‌ కారణంగా నేను ప్రమాణ స్వీకార వేదిక వద్దకు చేరుకోలేకపోయాను. యోగి జీ ప్రభుత్వం విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అని ఆమె హిందీలో ట్వీట్‌ చేశారు. లక్నోలో ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్‌ రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు. కేశవ్‌ మౌర్య, బ్రజేష్‌ పాఠక్‌ లు ఉపముఖ్యమంత్రులుగా, మరో 16 మంది కేబినెట్‌ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ వేడుకకు ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, హర్యానా సీఎం ఎంఎల్‌ ఖట్టర్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ సీఎం జైరాం ఠాకూర్‌ తదితర సీనియర్‌ నేతలు హాజరయ్యారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img