Friday, April 19, 2024
Friday, April 19, 2024

అగ్నివీరులకు మేం ఉద్యోగాలిస్తాం, కార్పొరేట్‌ రంగానికి కావాల్సింది వాళ్లే..

ఆనంద్‌ మహీంద్రా ట్వీట్‌
త్రివిధ దళాల్లో నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్‌ పథకంపై నిరసనలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. ఉద్యోగ భద్రత కోల్పోతామంటూ యువకులు నినదిస్తున్నారు.అయితే అగ్నివీరులకు తమ సంస్థలో అవకాశం కల్పించేందుకు సిద్ధంగా ఉన్నామంటూ ఆనంద్‌ మహీంద్రా ట్వీట్‌ చేశారు. ట్రాక్టర్ల తయారీ నుంచి ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ వరకూ అన్ని రకాల సేవలందిస్తోంది మహీంద్ర సంస్థ. వీటిలో ఏదో ఓ విభాగంలో ఉద్యోగం చేసేందుకు వారికి ప్రాధాన్యతనిస్తామని వెల్లడిరచారు.. అగ్నిపథ్‌ ను నిరసిస్తూ హింస చెలరేగడం బాధను కలిగిస్తోందని ఆయన అన్నారు. ఈ పథకం వల్ల యువతలో క్రమశిక్షణ పెరుగుతుందని అని ట్వీట్‌లో ప్రస్తావించారు. అగ్నివీరులు తమ సర్వీస్‌ అయిపోయేనాటికి ఏ ఉద్యోగమైనా సమర్థవంతంగా చేసేలా తయారవుతారని అన్నారు. అలాంటి వారిని రిక్రూట్‌ చేసుకునేందుకు మహీంద్ర గ్రూప్‌ ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుందని స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img