రాజస్థాన్ కాంగ్రెస్ పార్టీలో సంక్షోభం కొనసాగుతున్నది. ఈ క్రమంలో పార్టీ అధ్యక్షుడిగా పోటీ చేయాలనుకుంటే అశోక్ గెహ్లాట్ సీఎం పదవి నుంచి తప్పుకోవాలని సచిన్ పైలట్ పార్టీ హైకమాండ్తో అన్నట్లు వార్తలు వచ్చాయి. దీనిపై స్పందించిన సచిన్ పైలట్.. అదంతా పుకారేనని కొట్టిపారేశారు. ఆ తప్పుడు వార్త తనను భయపెట్టిందని చెప్పారు. తాను కాంగ్రెస్ హైకమాండ్తోగానీ, సీఎం అశోక్ గెహ్లాట్తోగానీ ఏమీ మాట్లాడలేదని తెలిపారు. కాగా, కాంగ్రెస్ అధ్యక్ష పదవికి అక్టోబర్ 17న ఎన్నికలు జరుగనున్నాయి. 19న ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఇప్పటివరకు అశోక్ గెహ్లాట్, శశిథరూర్ ప్రధాన అభ్యర్థులుగా ఉన్నారు.