Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

అధికారపార్టీ అక్రమాలకు పాల్పడొచ్చు: తికైత్‌

ముజఫర్‌నగర్‌(యూపీ): మార్చి 10వ తేదీన ఓట్ల లెక్కింపు సమయంలో అధికార బీజేపీ అక్రమాలక పాల్పడే అవకాశం ఉందని భారతీ కిసాన్‌ యూనియన్‌ (బీకేయూ) జాతీయ అధికార ప్రతినిధి రాకేశ్‌ తికైత్‌ ఆరోపించారు. ముజఫర్‌నగర్‌, బుధానా, పైర్‌కజి, కఠోలీ, మురాపూర్‌, ఛారత్వాల్‌తో సహా ఆరు అసెంబ్లీ స్థానాలల్లో ఫిబ్రవరి 10న పోలింగ్‌ జరిగిన విషయం తెలిసిందే. ఈవీఎంలను భద్రపరచిన నవీన్‌ మండీను తికైత్‌ పరిశీలించిన అనంతరం ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా అదనపు జిల్లా మేజిస్ట్రేట్‌, అదనపు ఎన్నికల అధికారి నరేంద్ర బహదూర్‌ మాట్లాడుతూ ఓట్ల లెక్కింపు సమయంలో ఎలాంటి అవకతవకలకు పాల్పడకుండా, కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టినట్టు వివరించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img