Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

అనుమానాస్పద స్థితిలో 20 నెమళ్లు మృతి

సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉన్న వ్యవసాయ పొలాల్లో దాదాపు 20కి పైగా నెమళ్లు మృతిచెందాయి. ఈ విషయాన్ని గమనించిన స్థానిక రైతు దాసరి అనిల్ కుమార్ ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించడంతో ఫారెస్ట్ డిప్యూటీ రేంజర్ శ్రీనివాస్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ రాముడు అక్కడికి చేరుకుని చనిపోయిన నెమళ్లను, చుట్టుపక్క ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం అక్కడి నుండి నెమళ్లను ప్రభుత్వ వెటర్నరీ హాస్పిటల్ కి తరలించి పోస్టుమార్టం నిర్వహించి శాంపిల్స్ ని ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపిస్తామని తెలిపారు. ఫోరెన్సిక్ నివేదిక అందిన తర్వాత నెమళ్ల మృతికి గల కారణాలు తెలుస్తాయని వెటర్నరీ డాక్టర్ విజయ సారథి అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img