న్యూదిల్లీ: భారత్లో తనను అక్రమంగా నిర్బంధించడం చట్టవిరుద్ధమని ప్రకటించాల్సిందిగా కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ను ఉపసంహరించుకునేందుకు మాఫియా నాయకుడు అబూ సలేంకు దిల్లీ హైకోర్టు గురువారం అనుమతిచ్చింది. 1993 ముంబై వరుస బాంబు పేలుళ్ల కేసులో అబూ సలేం జీవితఖైదు అనుభవిస్తున్న విషయం విదితమే. తనను పోర్చుగల్ పంపాలన్న సలేం పిటిషన్ను జస్టిస్ సిద్ధార్థ మృదూల్ జస్టిస్ రజనీశ్ భట్నాగర్లతో కూడిన ధర్మాసనం కొట్టేసింది. ఈ వ్యవహారం సుప్రీంకోర్టులో పెండిరగ్లో ఉన్నందున హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ఉపసంహరణకు అనుమతించాలని అబూ సలేం తరపు న్యాయవాది విన్నవించారు. రిట్ పిటిషన్ను వెనక్కి తీసుకుంటున్నట్లు పిటిషనర్ తరపు న్యాయవాది కోరారని, అందువల్ల ఆ పిటిషన్ను కొట్టివేస్తున్నట్లు జస్టిస్ రజనీశ్ భట్నాగర్ పేర్కొన్నారు. అనేక హామీలతో అబూ సలేంను ఇక్కడికి తీసుకొచ్చారని, అవన్నీ ఉల్లంఘనకు గురయ్యాయని, తన క్లెయింట్ను అక్రమంగా కస్టడీలో ఉంచడం సరికాదని సలేం తరపు న్యాయవాది వాదించారు. ఖైదీల అప్పగింత ఒప్పందం పూర్తిగా ఉల్లంఘనకు గురైందని తెలిపారు.