కర్ణాటక సీఎం యడియూరప్ప ఢల్లీి టూర్ ఆసక్తి రేపుతోంది. నిన్న ప్రధాని మోడీతో భేటీ అయ్యారు. అయితే రాష్ట్ర అభివృద్ధి కోసం తాను పీఎంను కలిశానని ప్రకటించారు. ఇవాళ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్రహోంమంత్రి అమిత్షాతో కూడా భేటీ అయ్యారు. కర్నాటకలో తిరిగి అధికారంలోకి రావడానికి కష్టపడి పనిచేయమని అమిత్షా తనకు సూచించారని చెప్పారు. రాబోయే రోజుల్లో మరిన్ని ఎంపీ సీట్లను కైవసం చేసుకోవాలని కూడా సూచించారని, అందుకు తాను సిద్ధమేనని హామీ ఇచ్చానని యడియూరప్ప పేర్కొన్నారు.