కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రోద్బలంతోనే టీఎమ్సీ జనరల్ సెక్రెటరీ అభిషేక్ బెనర్జీ కాన్వాయ్పై దాడి జరిగిందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తాజాగా ఆరోపించారు. త్రిపురలో అభిషేక్ బెనర్జీ కాన్వాయ్పై ఇటీవల కొందరు కర్రలు, లాఠీలతో దాడికి దిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. హోం మంత్రి మద్దతు లేకుండా ఇటువంటి దాడులు జరిగే అవకాశం లేదన్నారు. త్రిపుర రాష్ట్ర పోలీసులు ఎదుటే ఈ దాడి జరిగిందని, కానీ పోలీసులు మౌన ప్రేక్షకులుగా ఉండిపోయారన్నారు. ఇటువంటి దాడిని ఆదేశించే ధైర్యం త్రిపుర ముఖ్యమంత్రికి లేదని ఆమె ఆరోపించారు.