Friday, April 19, 2024
Friday, April 19, 2024

అవినీతి అనేది ఓ దెయ్యం.. దానికి దూరంగా ఉండండి.. ప్రధాని మోదీ

అవినీతి..అవినీతి పరులకు వ్యతిరేకంగా వ్యవహరించే విషయంలో ఏజెన్సీలు..అధికారులు భయపడాల్సిన అవసరం కానీ..రక్షణాత్మకంగా వ్యవహరించాల్సిన అవసరం లేదన్నారు ప్రధాని నరేంద్ర మోడీ.దిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో జరిగిన విజిలెన్స్‌ వీక్‌ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు. అవినీతిపరులు ఎంతటి శక్తిమంతులైనా కానీ, వారిపై చర్యలు తీసుకునే విషయంలో ఎలాంటి ఒత్తిళ్లకు లొంగిపోకుండా, దృఢంగా వ్యవహరించాలని దర్యాప్తు ఏజెన్సీలకు ప్రధాని సూచించారు. అవినీతిపరులు తప్పించుకోకుండా చూడాలని కోరారు. అవినీతిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని మోదీ స్పష్టం చేశారు. అవినీతి పరులు ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోకూడదన్నారు. అటువంటి వారికి రాజకీయ, సామాజిక రక్షణ కూడా లభించకూడదన్నారు.అవినీతి అన్నది ఓ దెయ్యం. దానికి దూరంగా ఉండాలి. గత ఎనిమిదేళ్ల నుంచి వ్యవస్థను మార్చేందుకు కృషి చేస్తున్నాం. చాలా సందర్భాల్లో అవినీతికి పాల్పడిన వారు, అభియోగాలు రుజువై జైలుకు వెళ్లొచ్చినా కానీ కీర్తింపబడుతున్నారు. భారత సమ్షాజానికి ఇదేమీ మంచి పరిస్థితి కాదు. నేడు కూడా అవినీతిపరులను సమర్థిస్తూ కొందరు మాట్లాడుతున్నారు. సమాజం పట్ల వారికున్న బాధ్యత, కర్తవ్యాన్ని తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img