Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

ఆదివారం ఒక్కరోజే 9,500 ప్రికాషనరీ డోస్‌ల పంపిణీ

న్యూదిల్లీ: కోవిడ్‌19 ప్రికాషనరీ వాక్సిన్‌ 9,500 డోస్‌లను 1859 సంవత్సరాల మధ్య ఉన్న వారికి ఆదివారం ఒక్కరోజే పంపిణీ చేశామని, దీంతో దేశవ్యాప్తంగా వాక్సిన్‌ పంపిణీ 185.75 కోట్ల డోస్‌లకు చేరినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ సోమవారం తెలిపింది. ఆదివారం నుంచి కోవిడ్‌19 ప్రికాషనరీ డోస్‌లను పంపిణీ కార్యక్రమాన్ని కేంద్రం చేపట్టింది. ఈ ప్రికాషనరీ డోస్‌ వేయించుకునేందుకు రెండోసారి వాక్సిన్‌ వేయించున్న దగ్గర నుంచి తొమ్మిదినెలలు పూర్తవ్వాల్సి ఉంటుంది. 1214 సంవత్సరాల మధ్య ఉన్న సుమారు 2.22 కోట్లమంది చిన్నారులకు కోవిడ్‌`19 వాక్సిన్‌ అందజేసినట్టు మంత్రిత్వశాఖ తెలిపింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img