న్యూదిల్లీ : ఆర్థిక, ఆరోగ్యమంత్రిత్వశాఖల జీ
20 సమావేశం శుక్రవారం రోమ్లో జరగనుంది. ఈ సమావేశానికి కేంద్ర ఆర్ధికశాఖమంత్రి నిర్మలా సీతారామన్ హాజరుకానున్నారు. ఇదే సమావేశంలో కోవిడ్ నివారణలో ఫలితాలు, ఇతర అంశాలపై చర్చించనున్నట్టు కేంద్ర ఆర్థికమంత్రిత్వశాఖ ట్వీట్ చేసింది. కొవిడ్ నియంత్రణా చర్యలపై, ఆర్ధిక, ఆరోగ్యమంత్రిత్వశాఖల మధ్య మరింత సమన్వయాన్ని ఎలా సాధించాలన్న విషయాన్ని ఈ సమావేశంలో చర్చించనున్నారు. అక్టోబరు 29న జీ20 ఆర్థిక, మంత్వ్రిశాఖల మంత్రులు రోమ్లో ఇటాలియన్ జీ20 ప్రెసిడెన్సీలో సమావేశమవుతారు. ఈ సమావేశానికి ఇటాలియన్ ఆర్థిక మంత్రి డేనియల్ ఫ్రాంకో, ఇటాలియన్ ఆరోగ్యశాఖమంత్రి రాబర్టో స్పెరన్జా అధ్యక్షత వహించనున్నారు. జీ`20 నాయకుల సమావేశం రోమ్లో ఈనెల 30, 31 తేదీల్లో జరగనున్న సందర్భంగా ఈ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది.