ప్రపంచ ఆరోగ్య సంస్థ ముఖ్య శాస్త్రవేత్త డాక్టర్ సౌమ్య స్వామినాధన్
కరోనా మహమ్మారి కట్టడిలో మనం కీలక దశలో ఉన్నామని, ఈ స్థితిలో మనం ఆశావహంగా ముందుకు వెళ్లడం ముఖ్యమని ప్రపంచ ఆరోగ్య సంస్థ ముఖ్య శాస్త్రవేత్త డాక్టర్ సౌమ్య స్వామినాధన్ అన్నారు. మహమ్మారితో తలెత్తిన పరిస్థితిని భారత్ సమర్ధంగా ఎదుర్కొంటోందన్నారు. డబ్ల్యూహెచ్ఓ ఆమోదించిన కరోనా టీకాల డేటా సానుకూలంగా ఉందన్నారు. బూస్టర్ డోస్ల ఆవశ్యకతపై పరిశీలన జరుగుతోందన్నారు. ప్రజల్లో నెలకొన్న విముఖతను ప్రభుత్వం తొలగించాలని అన్నారు.