న్యూదిల్లీ: ఎర్ర టోపీలు ఉత్తరప్రదేశ్కు ‘రెడ్ అలర్ట్’ అంటూ యూపీ పర్యటనలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ సమాజ్వాదీ పార్టీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ ఘాటుగా స్పందించారు. బుధవారం ఇక్కడ మీడియాతో ఆయన మాట్లాడుతూ ప్రజల ఆస్తులను అమ్మేస్తున్న వాళ్లే ఎరుపు రంగును చూసి భయపడుతున్నారని విమర్శించారు. ఇది అమ్మకాల ప్రభుత్వం. ఇప్పటివరకూ వాళ్లది అబద్ధాల ప్రభుత్వమే. ఇప్పుడు అమ్మకాల ప్రభుత్వంగానూ మారింది. వాస్తవ సమస్యలపై చర్చించడం ఇష్టం లేనందునే వాళ్లు ఇలాటి వ్యాఖ్యలు చేస్తున్నారని అఖిలేశ్ దీటుగా బదులిచ్చారు.