గోవా కేబినెట్ నిర్ణయం
పనాజి : బీజేపీ తన మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చినట్లు రాష్ట్రంలో ఇళ్లకు ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు అందించాలని నిర్ణయించినట్లు గోవా ప్రభుత్వం తెలిపింది. ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ సోమవారం తనతోపాటు మరో ఎనిమిది మంత్రులతో జరిగిన మంత్రివర్గం తొలి సమావేశంలో ఈ విషయాన్ని ప్రకటించారు. సీఎం సావంత్ సోమవారం సాయంత్రం చేసిన ఒక ట్వీట్లో, ‘సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నా అధ్యక్షతన తొలి సమావేశం జరిగింది. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి బీజేపీ మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చినట్లుగా మూడు ఉచిత సిలిండర్ల పథకాన్ని అమలు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది’ అని తెలిపారు. కాగా ప్రస్తుత తన హయాంలో ఇనుప ఖనిజం తవ్వకాన్ని పున: ప్రారంభించడం, ఉపాధిని సృష్టించడం తన ప్రాధాన్యతలు అని సావత్ ఇక్కడ విలేకరులతో అన్నారు.