Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

ఇవిగోౌ 71,506 మంది ఉద్యోగ ప‌త్రాలు : న‌రేంద్ర‌మోడీ

న్యూఢిల్లి: అభివృద్ధి చెందిన భారత్‌ సాధన కోసం చేసుకున్న తీర్మానాల సాకారం దిశగా ప్రతిభను సంతరించుకున్న శక్తిమంతమైన యువతకు సరైన అవకాశాల కల్పనకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. జాతీయ ఉద్యోగ మేళాలో భాగంగా వేర్వేరు ప్రభుత్వ విభాగాలు, సంస్థల్లో కొత్తగా నియమితులైన 71,506 మందికి ప్రధాని నరేంద్ర మోడీ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా నియామకపత్రాలను పొందిన వారిని, వారి కుటుంబాలను ప్రధాని అభినందించారు. ఒక నివేదిక ప్రకారం దేశంలో స్టార్టప్‌లు 40 లక్షలకు పైగా ప్రత్యక్ష లేదా పరోక్ష ఉద్యోగాలను సృష్టించాయని ప్రధాని తెలిపారు. ఉపాధికి కొత్త వేదికలుగా డ్రోన్లు, క్రీడా రంగాన్ని ఆయన ప్రస్తావించారు. ఆత్మనిర్భర్‌ భారత్‌ అభియాన్‌ అనే పథకం గ్రామాల నుంచి నగరాల వరకు కోట్లాదిగా ఉపాధి అవకాశాలను సృష్టిస్తోందని తెలిపారు. స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన అధునాతన శాటిలైట్లు, సెమీ హై స్పీడ్‌ రైళ్ళను గురించి ప్రస్తావిస్తూ గడచిన తొమ్మిదేళ్ళలో భారత్‌లో 30,000కు పైగా ఎల్‌హెచ్‌బీ బోగీలు తయారయ్యాయని, ఈ బోగీలకు అవసరమైన సాంకేతికత భారత్‌లో వేలాదిగా ఉద్యోగాలను సృష్టించాయని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img