జాప్యం చేయకుండా చర్యలు చేపట్టాలి
ప్రధాని మోదీకి మమత లేఖ
దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ నిర్వహిస్తున్న ఆనకట్టలు, జలాశయాల వల్ల రాష్ట్రంలో వరదలు సంభవిస్తున్నాయని, ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని ప్రధాన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ ప్రధాని నరేంద్ర మోదీకి ఓ లేఖ రాశారు. జార్ఖండ్లోని పంచేట్, మైథాన్లలోని ఆనకట్టల నుంచి నీటిని ప్రణాళిక లేకుండా విడుదల చేయడం వల్ల ఈ సమస్య వస్తోందని లేఖలో తెలిపారు. నియంత్రణ లేకుండా, ప్రణాళిక లేకుండా నీటిని విడుదల చేస్తున్నారని..ఈ వరదల సమస్య మానవుడు సృష్టించినదేనని పేర్కొన్నారు. ఆగస్టు 4న రాసిన లేఖలో కూడా ఈ వివరాలను తెలిపానని చెప్పారు. భారత ప్రభుత్వం ఈ మౌలిక సమస్యలను స్వల్పకాలిక, దీర్ఘకాలిక ప్రాతిపదికపై పరిష్కరించకపోతే, దిగువనున్న తీర ప్రాంత రాష్ట్రమైన పశ్చిమ బెంగాల్లో విపత్తులు కొనసాగుతాయని, ప్రభుత్వం ఇకపై జాప్యం చేయకుండా శ్రద్ధతో చర్యలు చేపట్టాలని కోరారు.