ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి నిరాశాజనక ఫలితాలు చవిచూస్తుండటంపై శివసేన పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ స్పందించారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోరమైన ఫలితాలు చవిచూస్తోందన్నారు.అంచనాలకు అనుగుణంగా ఫలితాలు కనిపించడం లేదని అన్నారు. పంజాబ్లో ప్రజలు వేరే ఆప్షన్ ఎంచుకున్నారని, ఆమ్ ఆద్మీ పార్టీని ఎన్నుకున్నారని అన్నారు. బీజేపీ విజయం వెనుక ఆ పార్టీ ఎన్నికల మేనేజిమెంట్ కూడా కారణమని అన్నారు. మధ్యాహ్నం 3 గంటల వరకూ వెలువడిన ఫలితాల ప్రకారం, ఉత్తరప్రదేశ్, మణిపూర్, ఉత్తరాఖండ్లో బీజేపీ అధికారం నిలబెట్టుకోవడం ఖరారు కాగా, పంజాబ్లో ఆప్ గెలుపు నిశ్చయమైంది. గోవాలోనూ కాంగ్రెస్ కంటే బీజేపీ ముందంజలో ఉంది.