లోక్సభ స్పీకర్ ఓం బిర్లా
న్యూదిల్లీ : లోక్సభ సెక్రటేరియట్ అధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమాన్ని ప్రతిపక్షాలు బహిష్కరించడంపై లోక్సభ స్పీకర్ ఓం బిర్లా విచారాన్ని వెలిబుచ్చారు. పార్టీలకు అతీతంగా పార్లమెంటు నిర్వహించే ఇటువంటి కార్యక్రమాలకు దూరంగా ఉండటం ప్రజాస్వామ్యానికి ఏ మాత్రం మంచిది కాదని ఆయన అన్నారు. సంవిధాన్ సమ్మాన్ దివస్ను పురస్కరించుకుని లోక్సభ నిర్వహించిన కార్యక్రమాన్ని కాంగ్రెస్తో సహా దాదాపు 15 ప్రతిపక్ష పార్టీలు బహిష్కరించాయి. కార్యక్రమం అనంతరం బిర్లా విలేకరులతో మాట్లాడుతూ.. దేశ ప్రయోజనాలకు సంబంధించి పార్టీలకతీతంగా జరిగే కార్యక్రమాలను బహిష్కరించే ఈ సంస్కృతి ప్రజాస్వామ్య ఆరోగ్యానికి మంచిది కాదని అన్నారు. ఇలాంటి కార్యక్రమాలకు అన్ని రాజకీయ పార్టీలు హాజరయ్యేలా ప్రతిపక్ష పార్టీల ప్రతినిధులతో చర్చిస్తానని చెప్పారు. ‘రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని పార్లమెంటు నిర్వహించిన కార్యక్రమాన్ని అనేక రాజకీయ పార్టీలు బహిష్కరించడంపై లోక్సభ ప్రిసైడిరగ్ అధికారిగా నేను తీవ్రంగా బాధపడ్డాను’ అని బిర్లా అన్నారు. కార్యక్రమాన్ని బహిష్కరించిన పార్టీలు తమ నిర్ణయాన్ని తనకు కూడా తెలియజేయకపోవడం విచిత్రంగా ఉందన్నారు. ‘వారికి ఏవైనా సమస్యలు ఉంటే, వారు నాతో చర్చించి ఉండాల్సింది. ఈ కార్యక్రమానికి హాజరయ్యేలా వారి సమస్యలను పరిష్కరించేందుకు నేను ప్రయత్నించి ఉండేవాడిని’ అని లోక్సభ స్పీకర్ అన్నారు. పార్లమెంట్ సక్రమంగా నడవాలని దేశ ప్రజలు ఆశిస్తున్నారని ఇందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని ఆయన అన్నారు.