బీహార్ సీఎం నితీష్
పాట్నా : మారుమూల ఉన్న ఉక్రెయిన్ దేశంలో అంతమంది భారతీయ విద్యార్థులు ఉన్నారని తెలసి ఆశ్చర్యపోయానని బీహార్ సీఎం నితీశ్ కుమార్ అన్నారు. గురువారం రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ…ఉక్రెయిన్`రష్యాల మధ్య ఘర్షణల నేపథ్యంలో తమను రక్షించాలని కోరుతున్న భారతీయ విద్యార్థులను దేశానికి సురక్షితంగా తీసుకురావాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. విద్య కోసం మారుమూల ఉండే ఆ చిన్న దేశాన్ని చాలా మంది విద్యార్థిని, విద్యార్థులు ఎంచుకోవడం తనను ఆశ్చర్యానికి గురి చేసిందని చెప్పారు. సోవియట్ యూనియన్ ఉన్న తరుణంలో కమ్యూనిస్టుల ప్రభావంతో ఆయాదేశాలకు వెళ్లేవారని, సోవియట్ యూనియన్ పతనం తరువాత కూడా అదే స్థితి ఉండటం తనకు భిన్నంగా కనిపిస్తోందని చెప్పారు. ఇది దేశంలో విద్యా వ్యవస్థలోని లోపాలను వ్యక్తం చేస్తోందని నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. ప్రైవేటు విద్యాసంస్థల ఆర్థిక దోపిడీని తట్టుకోలేకనే ఈ పరిస్థితి ఏర్పడిరదని చెప్పారు. ఉక్రెయిన్, నేపాల్, చైనా, ఫిలిప్పీన్ తదితర దేశాల్లో మన కన్నా మూడు రెట్ల తక్కువ ఖర్చుతోనే మెడిసిన్ కోర్సులు అందుబాటులో ఉండడంతో ఆయాదేశాలకు వెళుతున్నారని పేర్కొన్నారు. ఉక్రెయిన్లో తక్కువ ఫీజులతో మెడిసిన్ పూర్తి అవుతోందని చాలా మందికి తెలియడం కూడా తనను ఆశ్చర్యంలోకి నెట్టిందని పేర్కొన్నారు. సమాచార విప్లవానికి ఇది నిదర్శనమని పేర్కొన్నారు. ఏదేమైనా తాజా అనుభవాలు చర్చనియాంశాలేనని, విద్య విషయంలో దేశంలో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా ఉక్రెయన్లో చిక్కుకున్న వారిలో 144 మంది బీహార్ విద్యార్థులు స్వస్థలాలకు చేరుకున్నాట్టు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఓక ప్రకటన విడుదల చేసింది.