Friday, April 19, 2024
Friday, April 19, 2024

ఉచిత బియ్యాన్ని తప్పకుండా పంపిణీ చేయాల్సిందే: పియూష్‌ గోయల్‌

ఉచిత బియ్యాన్ని తప్పకుండా పంపిణీ చేయాల్సిందేనని కేంద్రమంత్రి పియూష్‌ గోయల్‌ స్పష్టం చేశారు. ఉచిత బియ్యం పంపిణీపై శుక్రవారం ఆయన రాజ్యసభలో మాట్లాడుతూ, ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ అన్న యోజనను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోవడం లేదని విమర్శించారు. ఉచిత బియ్యాన్ని తప్పకుండా పంపిణీ చేయాల్సిందేనన్నారు. రాష్ట్రాలు ఉచిత బియ్యం పంపిణీని నిర్లక్ష్యం చేయవద్దని సూచించారు. ఉచిత బియ్యాన్ని తెలంగాణ సరిగ్గా పంపిణీ చేయడం లేదని.. అందుకే తెలంగాణపై ఒత్తిడి తీసుకురావాల్సి వచ్చిందని అన్నారు. ఏపీతో కూడా ఉచిత బియ్యం పంపిణీపై మాట్లాడుతున్నామని, త్వరలో అక్కడ కూడా ఉచిత బియ్యం పంపిణీ సవ్యంగా చేస్తారని అనుకుంటున్నానని అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img