Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

ఉత్తరప్రదేశ్‌ బాలికలకు ప్రియాంక గాంధీ హామీలు

త్వరలో ఉత్తర ప్రదేశ్‌ శాసన సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా బాలికలకు హామీలు ఇచ్చారు. రాష్ట్రంలో తమ పార్టీ అధికారంలోకి వస్తే..డిగ్రీ పాసైన యువతులకు ఎలక్ట్రానిక్‌ స్కూటీ, ఇంటర్‌ పాసైన విద్యార్థినులకు స్మార్ట్‌ఫోన్‌ ఇస్తుందని ట్విట్టర్‌ వేదికగా హామీ ఇచ్చారు. తాను కొందరు విద్యార్థునులను కలిసినప్పుడు తాము చదువుకోవడానికి, తమ భద్రత కోసం తమకు స్మార్ట్‌ఫోన్లు అవసరమని చెప్పారని, అందుకే మేనిఫెస్టో కమిటీ సమ్మతితో యూపీ కాంగ్రెస్‌ ఈ నిర్ణయం తీసుకుందని తెలిపారు. ఆమె ఈ ట్వీట్‌కు కొందరు విద్యార్థినులు మీడియాతో మాట్లాడిన ఓ వీడియోను కూడా జత చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img