Tuesday, April 16, 2024
Tuesday, April 16, 2024

ఉత్తరాఖండ్‌ నేతలతో భేటీ కానున్న సోనియా

న్యూదిల్లీ : ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ మంగళవారం ఉత్తరాఖండ్‌ కాంగ్రెస్‌ నేతలతో సమావేశం కానున్నారు. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన విశ్వసనీయ వర్గాలు ఈ విషయాన్ని వెల్లడిరచాయి. ఈ మేరకు సోనియాగాంధీ రాష్ట్ర నేతలను దిల్లీకి ఆహ్వానించినట్లు సమాచారం. వచ్చే ఏడాది ప్రారంభంలో ఉత్తరాఖండ్‌ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. అసెంబ్లీ ఎన్నికలపై సోనియాగాంధీ పార్టీ నేతలతో చర్చించనున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. బీజేపీ నుంచి కాంగ్రెస్‌ పార్టీలోకి వచ్చేందుకు ఎంతమంది నేతలు సిద్ధంగా ఉన్నారు..? వారిలో ఎవరిని తీసుకోవాలి.. ఎవరిని తీసుకోవద్దు. గతంలో కాంగ్రెస్‌ రెబల్స్‌గా పనిచేసినవాళ్లలో ఎంతమంది పార్టీలోకి తిరిగి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు..? వాళ్లలోనూ తీసుకోవాల్సింది ఎవరిని.. తీసుకోకూడనిది ఎవరిని అనే అంశాలపై సమావేశంలో ప్రధానంగా చర్చ జరగనుంది. ఉత్తరాఖండ్‌లో విపత్తు నిర్వహణ పనులపైనా సోనియా రాష్ట్ర నేతలతో సమీక్షించనున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img