ఉప రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. పార్లమెంట్ భవనంలో ఉదయం 10 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుంది.ఈ పదవికి పశ్చిమ బెంగాల్ మాజీ గవర్నర్ జగదీప్ ధన్కర్ ఎన్డీయే అభ్యర్థిగానూ, కాంగ్రెస్ సీనియర్ నేత మార్గరెట్ అల్వా ప్రతిపక్షాల అభ్యర్థిగానూ పోటీ చేస్తున్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. కేంద్రమంత్రులు గజేంద్రసింగ్ షెకావత్, అర్జున్రామ్ మెఘ్వాల్, వి.మురళీధరన్ ఓటు వేశారు. మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ వీల్ఛైర్పై వచ్చి ఓటు వేశారు.