Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

ఎదురు కాల్పుల్లో ముగ్గురు జవాన్లకి గాయాలు

జమ్ముకశ్మీర్‌ బారాముల్లాలో ఎదురు కాల్పులు జరిగాయి. ఉగ్రవాదుల కాల్పుల్లో ముగ్గురు జవాన్లకు గాయాలయ్యాయి. బారాముల్లాలోని వాల్వా ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో బుద్గాం పోలీసులు, భద్రతా దళాలు గురువారం తెల్లవారుజామున గాలింపు చేపట్టాయి. ఈ క్రమంలో గాలింపు బృందాలపై టెర్రరిస్టులు కాల్పులు జరిపారని కశ్మీర్‌ ఐజీ విజయ్‌ కుమార్‌ చెప్పారు. ఉగ్రవాదుల కాల్పుల్లో ముగ్గురు జవాన్లు గాయపడ్డారని, వారిని ఆసుపత్రికి తరలించామని తెలిపారు. ప్రస్తుతం వారి పరిస్థితి బాగానే ఉందన్నారు. ఆ ప్రాంతంలో ఆపరేషన్‌ ఇంకా కొనసాగుతున్నదని వెల్లడిరచారు. కాగా, ఎదురు కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img