దిల్లీలోని యమునా ఖజురి ఖాస్లో పోలీసులు, నేరస్తులకు మధ్య జరిగిన కాల్పుల్లో ఇద్దరు నేరస్థులు హతమయ్యారు. ఈ ఘటన గురువారం ఉదయం చోటుచేసుకుంది. అమీర్, రంజాన్ అనే నేరస్తుల కోసం గాలింపు చర్యలు చేపడుతున్న క్రమంలో నిందితులు మొదట కాల్పులు జరిపారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో గాయపడిన అమీర్, రంజాన్లు ఆసుపత్రిలో మరణించినట్లు ఢల్లీి పోలీసులు ప్రకటించారు. వారి వద్ద నుంచి రెండు ఆటోమేటిక్ పిస్టల్స్, నాలుగు మ్యాగజైన్లు, 15 లైవ్ కాట్రిడ్జ్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.