భారత రక్షణ రంగ పరిశోధన సంస్థ(డీఆర్డీఓ) మరో ముందడుగు వేసింది.ఎమ్పీఏటీజీఎమ్(మ్యాన్ పోర్టబుల్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిస్సైల్) క్షిపణిని బుధవారం విజయవంతంగా ప్రయోగించింది. మ్యాన్ పోర్టబుల్ లాంచర్ ద్వారా ప్రయోగించిన ఈ క్షిపణి నిర్దిష్ట లక్ష్యాన్ని ఛేదించిందని డీఆర్డీఓ వర్గాలు తెలిపాయి.ఈ మిస్సైల్లో అత్యాధునిక ఇన్ఫ్రా రెడ్ సీకర్, ఎలక్ట్రానిక్ వ్యవస్థలు ఉన్నాయని పేర్కొంది. ఈ క్షిపణిని పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో 2.5 కిలోమీటర్ల లోపు లక్ష్యాలను ఛేదించేలా అభివృద్ధి పరిచింది.