Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

ఎయిరిండియా విమానంలో మంటలు.. తప్పిన పెను ప్రమాదం

ఎయిరిండియా విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. మస్కట్‌ నుంచి కొచ్చిన్‌ రావాల్సిన ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ విమానంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. రన్‌వేపై బయల్దేరడానికి సిద్ధమవుతుండగా మంటలు చెలరేగి దట్టమైన పొగ అలుముకుంది. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది విమానంలో ఉన్న 141 మంది ప్రయాణికులను, ఆరుగురు క్రూ సిబ్బందిని సురక్షితంగా కిందకి తీసుకొచ్చారు. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని మస్కట్‌ ఎయిర్‌పోర్ట్‌ అధికారులు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img