న్యూదిల్లీ: డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) కొరడా రaుళిపించింది. టాటా గ్రూప్ యాజమాన్యంలోని ఎయిర్ ఇండియాకు రూ.10 లక్షలు జరిమానా విధించింది. చెల్లుబాటు అయ్యే టికెట్లు ఉన్నప్పటికీ సదరు ప్రయాణీకులను విమానం ఎక్కడానికి అనుమతించని కారణంగా ఈ చర్యలు తీసుకున్నట్లు డీజీసీఏ ఓ ప్రకటనలో వెల్లడిరచింది. చెల్లుబాటయ్యే టికెట్లతో సమయానికి విమానాశ్రయానికి వచ్చినా… చెకింగ్స్ అన్నీ పూర్తి చేసుకున్నప్పటికీ కొన్ని విమానయాన సంస్థలు తమను తిరస్కరించాయని కొందరు ప్రయాణీకులు ఫిర్యాదు చేశారు. బెంగళూరు, హైదరాబాద్, దిల్లీలో తనిఖీలు చేసిన తర్వాత కొన్ని విమానయాన సంస్థలు ఇలాంటి సందర్భాల్లో పాటించాల్సిన నిబంధనలను పాటించడం లేదని డీజీసీఏ తెలిపింది. వీటిలో ఎయిర్ ఇండియా కూడా ఉందని పేర్కొంది. అందుకే ఆ సంస్థకు షోకాజ్ నోటీసు పంపామని పేర్కొంది. ఇలా చెల్లుబాటయ్యే టికెట్లు కలిగి ఉండి కూడా ప్రయాణానికి అనుమతి ఇవ్వని సందర్భంలో నిబంధనలు అవ ులు చేసే వ్యవస్థ ఎయిర్ ఇండియాలో లేనట్టుగా తోస్తున్నదని తెలిపింది. ఎన్ఫోర్స్మెంట్ యాక్షన్లో భాగంగా ఎయిర్ ఇండియాకు రూ. 10 లక్షల జరిమానా విధిస్తున్నట్లు స్పష్టం చేసింది. అంతేకాదు, వెంటనే ఈ సమస్యను పరిష్కరించే వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని డీజీసీఏ సూచించింది. లేదంటే తదుపరి చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. చెల్లుబాటయ్యే టికెట్లు ఉన్నప్పటికీ ప్రయాణీకులను అనుమతించని సందర్భంలో వారికి గంటలోపే మరో ప్రత్యామ్నాయ విమానాన్ని ఏర్పాటు చేయాలని డీజీసీఏ నిబంధనలను గుర్తు చేసింది. ఆవిధంగా చేస్తే ప్రయాణీకులకు పరిహారం అందిచాల్సిన అవసరం ఉండదని తెలిపింది. ఒక వేళ ప్రత్యామ్నాయ విమానం ఏర్పాటు చేయడానికి 24 గంటల్లోపు సమయం పడితే… సదరు ప్రయాణీకులకు రూ. 10 వేల పరిహారం ఇవ్వాల్సి ఉంటుందని వివరించింది. 24 గంటలు దాటిన పక్షంలో ప్రయాణీకులకు రూ. 20 వేల నష్టపరిహారం అందించాలని స్పష్టంచేసింది. పై నిబంధనలు పాటించని కారణంగానే ఎయిర్ ఇండియాకు జరిమానా విధించినట్లు డీజీసీఏ వివరించింది.