ఐదుగురు సజీవదహనం
అసోంలోని దిమా హసావో జిల్లా దియుంగ్బ్రాలో ఏడు ట్రక్కులకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో, ట్రక్కుల్లో ఉన్న ఐదుగురు సజీవ దహనమయ్యారు. గురువారం రాత్రి దియుంగ్బ్రాలో ట్రక్ డ్రైవర్లు, ఇతరులపై ఆయుధాలతో ఐదుగురు మిలిటెంట్లు కాల్పులు జరిపారని, అనంతరం ఆ ట్రక్కులకు నిప్పంటించారని ఇది ఉగ్రవాదుల చర్యగా భావిస్తున్నామని, దీనివెనక దిమాసా నేషనల్ లిబరేషన్ ఆర్మీ (డీఎన్ఎల్ఏ) హస్తమున్నట్లు అనుమానిస్తున్నామని జిల్లా ఎస్పీ జయంత్ సింగ్ తెలిపారు. అస్సామ్ రైఫిల్స్కు చెందిన భద్రతా దళాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయని తెలిపారు. కాలిపోయిన వాహనాల నుంచి ఐదు మృతదేహాలను వెలికితీశామన్నారు.