ఏ పథకమైనా పేదలకే ప్రాధాన్యమిస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మధ్యప్రదేశ్లో ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్నయోజన పథకం లబ్ధిదారులతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. దేశంలో 80 కోట్ల మందికిపైగా జనాభా ఉచితంగా రేషన్ పొందుతున్నారని, లాక్డౌన్ సందర్భంగా దాదాపు 8 కోట్ల మందికి ఉచిత గ్యాస్ సిలిండర్లు అందించామని చెప్పారు. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్నయోజన పథకం అయినా, ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ యోజన పథకం అయినా తాము పేదల ఆహారం, ఉపాధి గురించే ఆలోచిస్తున్నట్లు చెప్పారు.