రాష్ట్రాలకు సుప్రీంకోర్టు నోటీసు
ఐటీ చట్టంలోని 66ఏ సెక్షన్ వినియోగాన్ని కొనసాగిస్తుండంపై బదులివ్వాలని రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది.సెక్షన్ 66ఏను కొట్టివేసినప్పటికీ దీనిని కొనసాగిస్తుండటంపై పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ (ఎన్జీఓ) పిటిషన్ వేయగా.. దీనిపై జస్టిస్ ఆర్ఎఫ్ నారిమన్, బీఆర్ గవాయ్లతో కూడిన ధర్మాసనం సోమవారం నోటీసులు ఇచ్చింది. రద్దు చేసిన సెక్షన్ను కేవలం పోలీసులు స్టేషన్లలో మాత్రమే కాకండా దేశంలోని ట్రయిల్ కోర్టుల్లోనూ కొనసాగిస్తున్నారంటూ పిటిషనర్ అత్యున్నత న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. దీంతో జ్యుడిషియరీగా తాము ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటామని, అయితే పోలీసులు కూడా ఇందులో ఉన్నందున, రద్దయిన సెక్షన్ కొనసాగించకుండా సరైన ఉత్తర్వులిస్తామని కోర్టు పేర్కొంది.